ఆర్మూర్, అక్టోబర్ 08 – A9 న్యూస్:
🔹 వినతిపత్రం సమర్పణ:
భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు నూతల శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో సబ్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.
🔹 విషయనిర్దేశం:
రైతులు మొక్కజొన్న కు తగిన మద్దతు ధర లేక, కొనుగోలు కేంద్రాల సంఖ్య లేకపోవడంతో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు.
🔹 ప్రస్తుత పరిస్థితి:
MSP (మద్దతు ధర): ₹2400.
దళారుల కొనుగోలు ధర: ₹1800–₹2000.
రైతులకు నష్టం: క్వింటాలకు ₹400–₹500.
కిసాన్ మోర్చా డిమాండ్లు:
1. వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
2. రబీ సీజన్లో పండించిన వడ్లకు క్వింటాకు ₹500 బోనస్ రైతుల ఖాతాల్లో జమ చేయాలి.
3. పసల్ బీమా యోజనను రాష్ట్రంలో తక్షణమే అమలు చేయాలి.
4. రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలి.
పాల్గొన్నవారు:
చిట్టి భజన, పోశెట్టి మల్లయ్య, శ్రీనివాస్, సంతు, కలిగోట ప్రశాంత్ మరియు ఇతర రైతులు.







