కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ వేధింపుల్లో భాగంగా జరుగుతున్న సిట్ విచారణకు హాజరు కావడానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఎర్రవెల్లి నివాసం నుంచి హైదరాబాద్కు బయలుదేరారు.
హైదరాబాద్కు వస్తున్న కేసీఆర్ గారికి దారి పొడవునా అభిమానులు, కార్యకర్తలు, పార్టీ నాయకులు “జై తెలంగాణ.. జై కేసీఆర్” నినాదాలతో ఘనంగా స్వాగతం పలికారు. కేసీఆర్ గారి కాన్వాయ్పై పూలు జల్లుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.
వందలాది మంది రహదారుల వెంట నిలిచి కేసీఆర్ గారికి మద్దతు ప్రకటిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ వేధింపులపై నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.








