హైదరాబాద్ లోని ఓ ప్రైమరీ స్కూల్లో నర్సరీకి రూ.2.51 లక్షలు, ఒకటి రెండో తరగతులకు రూ.2.91 లక్షల ఫీజు వసూలు చేస్తోందని అనురాధ తివారీ అనే ఓ యూజర్ సోషల్ మీడియాలో వాపోయారు. ఏబీసీడీలు నేర్చుకోవడానికి నెలకు రూ.21 వేలు చెల్లించాలని పేర్కొన్నారు. ఇంత భారీ ఫీజుకు స్కూలు యాజమాన్యం ఎలా న్యాయం చేస్తున్నారని, ఆ స్థాయిలో ఖర్చయ్యేంతగా ఏం నేర్పిస్తున్నారో అంటూ ప్రశ్నించింది. ఈ పోస్టు ప్రస్తుతం ఎక్స్లో వైరల్ అవుతోంది.