48 గంటల్లో ఉపాధిహామీ జాబ్ కార్డు..,.

On: Sunday, March 29, 2026 11:17 AM

 

Mar 29, 2026,

ఆసిఫాబాద్: కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకంలో పలు మార్పులు చేసింది. పథకం పేరును వీబీజీ రామ్ జీగా మారుస్తూ పనిదినాలు పెంచింది. సమయానికి వేతన చెల్లింపులు, ఆలస్యానికి పరిహారం అందించేలా భరోసా కల్పించింది. కొత్త జాబ్ కార్డు జారీ సులభతరం చేస్తూ, దరఖాస్తు చేసిన 48 గంటల్లో జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ-కేవైసీ అమల్లోకి తెచ్చింది. ఆధార్ కార్డుతో నేరుగా క్షేత్ర సహాయకుడిని సంప్రదిస్తే ఈ-కేవైసీ పూర్తి చేసి, ఉన్నతాధికారుల పరిశీలన అనంతరం కార్డు జారీ చేస్తారు.

29 Mar 2026

Leave a Comment