జక్రాన్ పల్లి :
తొర్లికొండ గ్రామంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ అయినటువంటి ఉదయ భాస్కర్ రావు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది, వీడీసీల అన్యాయాలు, మహిళలపై మరియు పిల్లలపై జరిగే నేరాలను దృష్టిలో ఉంచుకొని మళ్ళీ అటువంటి నేరాలు జరగకుండా న్యాయస్థాన చట్టాల గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు దిలీప్, సీనియర్ అడ్వకేట్ రాజేశ్వర్,నర్రా రామరావు,ఆశ నారాయన,సఖి కౌన్సిలర్ లావణ్య,మంజాలా యాదవ్, జక్రాన్ పల్లి SHO,CI,MRO,MPDO,GP స్పెషల్ ఆఫీసర్,గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది..






