మెదక్, ఆగస్టు 14 (ఎ9 న్యూస్):
మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న జరిగిన పేకాట దాడిలో పట్టుబడ్డ ఇద్దరు ఏఆర్ కానిస్టేబుల్స్ — అంజనేయులు మరియు సురేష్ — ను సస్పెండ్ చేస్తూ శాఖా పరంగా చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.
ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసినట్టు ఆయన మీడియాకు వెల్లడించారు. పోలీస్ విధుల్లో ఉన్నవారు ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనడం తీవ్రంగా పరిగణించబడుతుందనీ, తదుపరి విచారణ కొనసాగుతుందన్నారు.







