స్థానిక ఎన్నికల్లో ఆర్మూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా….

On: Thursday, July 24, 2025 5:41 PM

 

ఆర్మూర్, A9న్యూస్ ,జూలై 24 :

బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయి నడపలేని స్థితిలో ఉన్న ఆర్టీసీని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి పథకం ద్వారా 6700 కోట్లు ప్రయాణ చార్జీలను ఆదా చేసుకున్న సందర్భంగా మహిళ లందరికీ బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు థోండి రమణ శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డ అడుగుకు అర్థం చెప్పిన పాలనకు ఇది గొప్ప నిదర్శనం 18 నెలల్లోనే 200 కోట్ల ఉచిత ప్రయాణాలు ఇది అభివృద్ధికి కాదు, ఆత్మ విశ్వాసానికి బస్సు టికెట్టు,ఈ పథకంతో ప్రతి మహిళ భయంతో కాకుండా ధైర్యంతో గమ్యానికి చేరు కుంటుంది. ఈ ప్రభుత్వం అందించిన ఓ భరోసా ఇది మార్పు మొదలైన దశ ఈ అవకాశాన్ని విని యోగించుకున్న లక్షలాది మహిళలకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ పథకాన్ని రోజూ విజయవంతంగా నడిపిస్తున్న,ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు సిబ్బందికి శ్రమకు వందనమన్నారు. మీరు నడుపుతున్నది బస్సులు కాదు ఓ సమాజాన్ని ముందుకు తీసు కెళ్తున్నారు. ఇదే నిజమైన సంక్షేమ పాలనకు అద్దం మహిళా సాధికారతకు అడుగులు వేస్తున్న ప్రజా పాలన, ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కి, పొన్నం ప్రభాకర్, బట్టి విక్రమార్కలకు, మంత్రి మండలి అందరికీ ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ప్రొద్దుటూరు వినయ్ రెడ్డి కి బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు థోండి రమణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా పాలన చేపట్టిన పథకాలు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ఆర్మూర్ ప్రాంత ప్రజల కొరకై ప్రత్యేక చొరవ చూపిస్తున్న వినయ్ రెడ్డి పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారని రానున్న స్థానిక ఎన్నికల్లో ఆర్మూర్ మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

26 Jul 2025

Leave a Comment