Jan 16, 2026,
తెలంగాణ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 10:50 గంటలకు బేగంపేట నుండి హెలికాప్టర్ లో అదిలాబాద్కు చేరుకుంటారు. అక్కడ చనాక కొరట పంపు హౌస్ ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారు. అనంతరం నిర్మల్ జిల్లా సదర్ మట్ బ్యారేజీని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు నిర్మల్ మినీ స్టేడియంలో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. సా.4 గంటలకు హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారు.








