మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలం జంగారై గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. గ్రామం బయట పేరుకుపోయిన చెత్త కుప్పలను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఆవుల గోపాల్ రెడ్డి పర్యవేక్షించారు. గ్రామాన్ని శుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.








