హైదరాబాద్:డిసెంబర్ 12
ఎస్సీ,ఎస్టీ,బీసీ,జనరల్ గురుకుల పాఠశాలలో 5,తరగతితో పాటు 6, నుంచి 9 తరగతి వరకు 2026 -27 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటనను సెట్ కన్వీనర్, ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ కృష్ణ ఆదిత్య గురువారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు.
ఈ నెల 11 నుంచి వచ్చే సంవత్సరం జనవరి 21 వరకు ఆన్లైన్లో 100,రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటన ద్వారా తెలిపారు.
ప్రవేశ పరీక్ష 2026 ఫిబ్రవరి 22న జరగనుంది పూర్తి వివరాలకు ఆయా సంక్షేమ శాఖల వెబ్సైట్లను సందర్శించాలని కోరింది అదనపు సమాచారం కోసం 040-23391598, 040-24734899 ఫోన్ నెంబర్లలో సంప్రదించ వచ్చని తెలిపింది.







