ఆర్మూర్, ఆగస్టు 30 :
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆర్మూర్ MPDO కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ సయ్యద్ అవేస్, జనరల్ సెక్రటరీ మహ్మద్ రజాక్ పాల్గొన్నారు.
MPDO ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో బూత్ స్థాయిలో నిర్వహించాల్సిన ఏర్పాట్లు, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగింది.







