నిర్మల్ జిల్లా మెండోర మండలం పోచంపాడులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సాయి లిఖిత డెంగ్యూ జ్వరంతో మృతి చెందింది. గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమెకు మొదట నిర్మల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఆరోగ్యం విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మృతదేహంతో నిరసనకు దిగారు.








