A9 న్యూస్ ప్రతినిధి – ఆర్మూర్:
ఆర్మూర్ మండలంలోని హరిపూర్ (పల్లె) నూతన గ్రామపంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన పార్దెపు సంజీవ్ ని చాలువాతో విలేకరులు ఘనంగా సన్మానించారు. గ్రామాభివృద్ధిపై స్పష్టమైన దృష్టి, ప్రజల సమస్యలపై నిబద్ధతతో ముందుకు సాగుతున్న సంజీవ్ నాయకత్వానికి గుర్తింపుగా ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పార్దెపు సంజీవ్ మాట్లాడుతూ, తనపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. హరిపూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్, అనీఫ్, సాయి ప్రణీత్, వినోద్, శ్రీనివాస్, మహేష్, దినేష్, వినోద్, శ్రావణ్ తదితరులు పాల్గొని నూతన సర్పంచ్కు శుభాకాంక్షలు తెలిపారు.







