A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్ :

త్వరలో ప్రధాని మోదీ, అమిత్ షా పర్దరాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో రెండంకెల సీట్లు సాధించడమే ధ్యేయంగా బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణలో పర్యటించనుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేసిన బీజేపీ.. నామినేషన్లు ముగిసిన వెంటనే మరింత వేగం పెంచనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 27న హైదరాబాద్‌కు రానున్నారు. యన తన పర్యటనలో ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలపై బీజేపీ నేతలతో చర్చించనున్నారు. హైటెక్ సిటీ నోవాటెల్‌లో ఐటీ నిపుణులతో మోదీ భేటీ కానున్నారు.అక్షరాస్యత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెంచడమే ధ్యేయంగా వారితో చర్చించనున్నారు. మోదీ పర్యటన తరువాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సైతం రాష్ట్రానికి రానున్నారు.ఆయన బీజేపీ కీలక నేతలకు ఎన్నికల వ్యూహాలపై చర్చించి, దిశానిర్దేశం చేయనున్నారు. ఈ లోపే బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సైతం రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.. కేపి

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *