A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
నందిపేట్ మండలంలోని జోరుపూర్ ప్రాథమిక పాఠశాల దయనీయ స్థితికి చేరింది. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న 25మంది విద్యార్థులు ఒక్క గదిలోనే ఇబ్బందులు పడుతున్నారు. పైకప్పు ఊడిపడటం, గోడలు పగలడంతో విద్యార్థులు భయాందోళనల్లో ఉన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, విద్యార్థులు విద్యాశాఖను కోరుతున్నారు.






