హైదరాబాద్:జనవరి 11

సంక్రాంతికి సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్ – విజయవాడ రహదారి భారీగా రద్దీ పెరిగింది. దీంతో అబ్దుల్లా పూర్ మెట్ నుంచి కొత్త గూడెం వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతు న్నాయి.

 

చౌటుప్పల్ పతంజలి టోల్ ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సిబ్బంది 10 టోల్ బూతుల ద్వారా ఏపీ వైపు వెళ్తున్న వారిని పంపిస్తున్నారు. అటు హైదరాబాద్ వైపు వచ్చే వారిని 6 గేట్ల ద్వారా పంపిస్తున్నారు. చౌటుప్పల్ కూడలిలో అండర్ పాస్ నిర్మాణాల వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది.

 

నేడు, రేపు రద్దీ మరింత పెరుగుతుందనే అంచనా లు ఉన్నాయి. రద్దీ దృష్ట ప్రత్యామ్నాయ మార్గాలను పోలీసులు సూచిస్తున్నారు. ఎంబీబీఎస్, జేబీఎస్, దిల్ షుక్ నగర్ బస్టాండ్, ఎల్బీనగర్ కూడలి వద్ద రద్దీ పెరిగింది.దిల్ షుక్ నగర్ నుంచి చౌటుప్పల్ కు ఒక గంటలో చేరుకోవచ్చు. కానీ గతేడాది బోగి కి ముందు రోజు మూడు నాలుగు గంటల సమయం పట్టింది. ఈసారి పండుగకు అదే స్థాయిలో రాకపోకలు సాగే అవకాశం ఉంది.

 

దీని నిజం చేస్తూ శుక్రవారం సాయంత్రం నుంచి హైదరాబాద్ విజయవాడ హైదరాబాద్ హైవేపై వాహన రద్దీ మొదలైంది. పతంగి టోల్ ప్లాజా ఇరువైపులా కలిపి 16 టోలు బూతులు ఉండగా.. విజయవాడ మార్గంలోని 10ని తెరవడం గమనార్హం. శని, ఆదివారాల్లో ఈ రద్దీ మరింత అధికంగా ఉండే అవకాశం ఉంది.

 

పైగా ఆదివారం చౌటుప్ప ల్లో సంత ఉంటుంది. అప్పుడు హైవేపై వెళ్లే వాహనాలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. రాకపోకలకు ఇప్పటికే సమస్యగా మారిం ది. వీటన్నిటిని కారణంగా సం క్రాంతి వెళ్లే వాహనదా రుల కోసం పోలీసులు ప్రత్యా మ్నాయ మార్గాలను సూచిస్తున్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *