ఆగస్ట్ 15. 2025,
79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందిపేట్ 2024-25 ఎస్ఎస్సి బ్యాచ్లో తెలుగులో అద్భుత మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానం జరిగింది. తెలుగులో 99/100 మార్కులు సాధించిన అర్షియా, 91/100 మార్కులు సాధించిన అన్ఫల్, 90/100 మార్కులు సాధించిన అతికలను, తెలుగు ఉపాధ్యాయురాలు బండారి శ్రీదేవి మొత్తం రూ.7000 నగదు పురస్కారంతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ఎం. మంజుల, ఉపాధ్యాయ బృందం, గ్రామ వీడీసీ సభ్యులు, గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.







