నేడు పూజ్య శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి 83వ జన్మదినోత్సవ వేడుకలు

A9 న్యూస్ ప్రతినిధి:

*నేడు పూజ్య శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి 83వ జన్మదినోత్సవ వేడుకలు

కోటగిరి బాల గంగాధర్, కంకణాల రాజేశ్వర్ మీడియా సమావేశంలో వెల్లడి కర్ణాటక రాష్ట్రం మైసూర్ కు చెందిన ఆధ్యాత్మిక గురువు, అవధూత దత్త పీఠం వ్యవస్థాపకులు, నిర్వాహకులు, అవధూత దత్త పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి 83వ నిర్జల ఏకాదశి జన్మదినోత్సవ వేడుకల్ని స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సర తేది:06-06-2025 శుక్రవారం రోజున నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లి మండల కేంద్రం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రక్కనే గల శ్రీ గురుదత్త ఆశ్రమం ఎడపల్లిలో ఆశ్రమ వ్యవస్థాపకులు, ధర్మ ప్రచారకులు నాగ సాధు కైవల్య దత్తానందగిరి స్వామీజీ శారదా మాతాజీ పుణ్య దంపతుల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహిస్తున్నట్లు దత్త సేవకుడు కోటగిరి బాల గంగాధర్, దత్త ప్రచారకుడు కంకణాల రాజేశ్వర్ గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా కోటగిరి బాలగంగాధర్, కంకణాల రాజేశ్వర్ మాట్లాడుతూ… ఓంకార్ ఆశ్రమం సిర్గాపూర్ కు చెందిన నాగసాధు గజానందగిరి, సంస్థాన్ నారాయణపురం కు చెందిన శంకరానంద స్వామీజీ, గోరి కొత్తపల్లికి చెందిన కృష్ణానందగిరి స్వామి, కనకాపూర్ కు చెందిన సత్యానంద ఆశ్రమం బాలానందగిరి స్వామి, దుర్గా, సేవాలాల్ పూజారి రమావత్ లాలు ఆత్మీయ అతిథులుగా విచ్చేస్తున్నారని అన్నారు. తదనంతరం ఉదయం 6 గంటలకు మహాగణపతి హోమం, ఉదయం 8:30 నిమిషాలకు పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి పాదుకలకు పాదుకాపూజ, మహాత్ముల ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఎడపల్లి మండల గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు, నిరుపేద మహిళలకు ఆశ్రమ సేవకులకు 170 చీరలు పంపిణీ చేయబడును. ఆత్మీయ అతిథులకు ఆత్మీయ సత్కారం ఉంటుంది. మహా అన్నదాన సత్రం గలదు. కావున ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వివిధ ఆలయ, ఆశ్రమ నిర్వాహకులు, దత్త బంధువులు, సేవకులు, సమస్త భక్త జనావళి ఇట్టి మహత్తర కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోటగిరి బాల గంగాధర్, కంకణాల రాజేశ్వర్ కోరారు.

Leave a Comment