*యోగేశ్వరా కాలనీ లో దొంగల బీభత్సం….
*వారం రోజుల్లో రెండో ఘటన….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణంలోని యోగేశ్వరా కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు చోరీకి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది శనివారం మధ్యాహ్నం 2:00 గంటల సమయంలో బాధితుడు ఇంటెనుక శ్రీధర్ ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు వివరాల ప్రకారం గుర్తుతెలియని నేరస్థులు ఇంటి తాళం పగలగొట్టి అద్దతులం పతనపు ఉంగరం అద్దతులం బంగారు చెవి రింగులు మరియు రూ. 60,000 నగదును అపహరించారని తెలిపారు దొంగతనానికి గురైన మొత్తం ఆస్తి విలువ రూ. 80,000/-గా అంచనా
విశేషంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఇదే కాలనీలో వారం రోజుల వ్యవధిలో ఇది రెండో చోరీ కావడం గమనార్హం వరుసగా జరుగుతున్న ఈ ఘటనలతో కాలనీవాసుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి కాలనీలో రాత్రిపూట పోలీసులు పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని బాధితుడి అన్న ఇంటెనుక శ్రీకాంత్ కోరుతున్నారు.
పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కాలనీవాసులు త్వరగా దొంగలను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.