A9 న్యూస్:
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనల మేరకు నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు జీవన్ రెడ్డి పిలుపుమేరకు సోమవారం నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. శతాబ్దాల పరాయి పాలకుల దోపిడీ దౌర్జన్యాలతో సుసంపన్నమైన తెలంగాణ దోచుకోబడి ప్రజాస్వామ్య స్వతంత్ర భారతదేశంలో వలస పాలకుల ఆంధ్ర పెట్టుబడిదారుల అణచివేతతో తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు ఆక్రమిస్తే తెలంగాణ రాష్ట్ర భాష యాస అవమానాలకు చీత్కారాలకు గురైతే తిరగబడ్డ తెలంగాణ సాయుధ పోరాటం విద్యార్థి ఉద్యమంతో విప్లవాన్ని చూపిస్తే దగా పడ్డ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కోట్లాది తెలంగాణ ప్రజలకు అందించిన మహోన్నత నాయకుడు కేసీఆర్ తెలంగాణ ఉన్నంతకాలం కెసిఆర్ ఉంటాడని తెలంగాణ ఆత్మ కెసిఆర్ అని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఏర్పాటులో అమరులైన వీరులందరిని స్మరించి రెండు నిమిషాల మౌనం పాటించి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్, సీనియర్ నాయకులు ఉల్లి శ్రీనివాస్ గౌడ్, బాలగంగాధర్, సయ్యద్ హుస్సేన్, బొడ్డు రాజశేఖర్, ఉప సర్పంచ్ భరత్ కొత్తూరు, సర్పంచ్ బాబు రాజ్, ఆంధ్ర నగర్ సర్పంచ్ రామారావు, ఎంపీటీసీ మనోజ్ రావు, క్రమ శాఖ అధ్యక్షులు శ్రీను, కానూరి గంగాసాగర్, పాష సాయి రెడ్డి, దుబాయ్ శీను, తాటికాయల సాగర్, విజయ్, రజనీకాంత్, గణేష్, రవి, సుభాష్, ప్రసాద్, నరేష్, భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.