సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ఆరోగ్య ఉప కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సీజనల్ వ్యాధుల పట్ల ఇంటింటికి వెళ్లి ఆరోగ్య సిబ్బంది ప్రజలకు సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆరోగ్య కార్యకర్త జక్కుల మోహన్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలన్నారు. ఇంటి పరిసరాలలో కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ డబ్బాలు, పాత కుండలు, పనికిరాని వస్తువులను ఉంచుకోరాదని.. దానిలో వర్షపు నీరు పడి దోమల లార్వా వృద్ధి చెంది డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధులు ప్రభలుతాయని అన్నారు. దోమ పుట్టుక గురించి, దోమల వల్ల వచ్చే వ్యాధుల గురించి దోమల నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. డెంగ్యూ లార్వా ఉన్న వాటిలో దోమలను చంపే మందును పోయడం జరిగింది. అదేవిధంగా లార్వా ఉన్న పాత్రలో నీటిని పారిపోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు మమత, నవ్య, అరుణ, సుభద్ర తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment