A9 న్యూస్ ప్రతినిధి:
24 నాన్-బెయిలబుల్ వారెంట్లతో తప్పించుకుంటున్న నేరస్తుడిని అరెస్టు చేసిన నిజామాబాద్ సిసిఎస్ పోలీసులు – పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.ఎస్.
గత కొన్ని సంవత్సరాలుగా పలు నేరాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న కామారెడ్డి జిల్లాకు చెందిన బబ్లు బాలాజీ గైక్వాడ్ అలియాస్ ధన్ల బాబు (47) ఖానాపూర్ గ్రామం, దేగ్లూర్ తాలూకా, నాందేడ్ జిల్లా పై మొత్తం 24 నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయినప్పటికీ, ఇంతవరకు పట్టుబడకుండా నేరాలు చేస్తూ వచ్చాడు.
ఈ రోజు ఇతను నిజామాబాద్ పరిసర ప్రాంతాలలో నేరాలు చేయడానికి యత్నిస్తున్నట్టు సమాచారంతో, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్. ఆదేశాలతో సిసిఎస్ పోలీసులు అప్రమత్తమై సక్రమంగా గాలించి అతనిని అరెస్టు చేసి కామారెడ్డి పోలీసులకు అప్పగించారు.
ఈ ఆపరేషన్లో సిసిఎస్ ఏసిపి కె.నాగేంద్ర చారి, సీ.ఐ సురేష్, సి సి ఎస్ సిబ్బంది పాల్గొనడంతో నేరస్తుడు అదుపులోకి తీసుకున్నారు, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.