A9 న్యూస్ నిజామాబాద్ ప్రతినిధి:
బాల్కొండ నియోజకవర్గం ముప్కాల్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ప్రస్తుతం శిథిల భవనంలోనే నడుస్తోంది 2018-19లో ప్రభుత్వం కొత్త భవనానికి ఆమోదం తెలిపినా, ఐదేళ్లు గడిచినా పూర్తికాలేదు
ఈ భవన నిర్మాణాన్ని నిద్రలో ముంచిన జిల్లా అధికారుల నిర్లక్ష్యం అంతులేనిది ఇది కేవలం బాధ్యతారాహిత్యమే కాదు – బాలికల భవిష్యత్తుపై నేరప్రాయ నిర్లక్ష్యం
బాత్రూములు లేని పరిస్థితి, ప్రవాహగోడలు లేక రాత్రివేళ ప్రమాదాలు, కీటకాల బెడద ఇవన్నీ ఒక ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్నాయి అనిపించడం కూడా విచారకరం
ప్రభుత్వం ప్రకటనలతోనే పరిమితం అవుతుంది నేలమీద పరిస్థితులు మాత్రం దారుణంగా ఉన్నాయి.
వేలాది బాల్కొండ ప్రజలు కొత్త భవనం కోసం ఎదురుచూస్తుంటే, అధికారులు మొహం చాటేస్తున్నారు ఇది ప్రజల ఓర్పును పరీక్షించే ప్రయత్నం అయితే – ఇప్పుడు ప్రజల ఆగ్రహం పరీక్షకు సిద్ధంగా ఉంది.
ఇకనైనా సరిచేసుకోకపోతే రోడ్డెక్కే సమయం దగ్గరపడుతోంది.
జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క, కలెక్టర్ వెంటనే స్పందించాలి. పనులు వెంటనే ప్రారంభం కావాలి
భవనానికి పూర్తి మౌలిక వసతులు – బాత్రూములు, ప్రవాహగోడ, సీసీ కెమెరాలు, నాన్ టీచింగ్ సిబ్బంది తక్షణమే ఏర్పాటు చేయలి.