A9 న్యూస్ ప్రతినిధి:
నిజామాబాద్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం కంఠేశ్వర్ బైపాస్ రోడ్
నిజామాబాద్ నగరంలో అగ్ని ప్రమాదాలు వరుసగా కలకలం సృష్టిస్తున్నాయి తాజాగా మంగళవారం తెల్లవారుజామున నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది బైపాస్ ప్రాంతంలోని ప్రముఖ ఫర్నీచర్ షోరూమ్ రాయల్ ఓక్ లో ఉదయం సుమారు 3 గంటల సమయంలో మంటలు చెలరేగాయి
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను సమర్థవంతంగా అదుపులోకి తెచ్చారు అగ్నిమాపక చర్యల్లో డిస్ట్రిక్ట్ ఫైర్ అధికారి పరమేశ్వర్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ శంకర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు
ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు గుర్తించారు ఈ ప్రమాదంలో సుమారు రూ. 10 లక్షల విలువైన ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు
సమయానుగుణంగా ఫైర్ సిబ్బంది స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలను అధికారులు త్వరలో వెల్లడించనున్నారు. ఈ ఘటనపై నగరవాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది ఇటీవలి కాలంలో నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు సంభవిస్తుండటంతో భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.