A9 న్యూస్ ప్రతినిధి నిజమాబాద్:
మెండోరా మండలం పోచంపాడ్ లోని ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఎస్సారెస్పీలోకి శుక్రవారం ఉదయం 8 గంటలకు 3310 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ నీటిమట్టం క్రమంగా పెరిగింది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 100, మిషన్ భగీరథ ద్వారా 231, ఆవిరి రూపంలో 321 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (80. 5 టీఎంసీలు) అడుగులు కాగా గురువారం సాయంత్రానికి ప్రాజెక్ట్ 1062. 8 అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.