గోదావరిలో నలుగురు యువకుల మృతి…

*గోదావరిలో నలుగురు యువకుల మృతి….

*బాసర పుణ్య స్నానం బలికొన్న 4 ప్రాణాలు…

A9 న్యూస్ ప్రతినిధి నిర్మల్ జిల్లా:

బాసర గోదావరిలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది హైదరాబాద్ చింతల్ బజార్‌కు చెందిన 18 మంది యువకుల బృందం పుణ్యస్నానాల కోసం బాసరకు విహారయాత్రగా వచ్చింది ఇందులో నలుగురు యువకులు గోదావరిలో తేలిన ఇసుక మెటల వద్ద స్నానం చేస్తుండగా లోతైన ప్రాంతంలో మునిగి చనిపోయారు.

మృతదేహాలను అంబులెన్స్ ద్వారా బాసర గోదావరి మొదటి ఘాట్ నుండి సమీప ఏరియా ఆసుపత్రికి తరలించారు అధికారికంగా మృతుల వివరాలు ఇంకా వెల్లడించలేదు కుటుంబ సభ్యులు ఓ వ్యక్తి ఇంకా నీటిలోనే గల్లంతైనట్టు అంటూ విలపిస్తున్నారు.

పుణ్యస్నానాల పేరుతో నిర్లక్ష్యంగా ప్రవేశించిన ప్రాంతంలో ఎదురైన ఈ విషాద ఘటన స్థానికులను కలచివేసింది పోలీసులు సంఘటనపై విచారణ ప్రారంభించారు.

Leave a Comment