రక్తదానం చేసిన సేవకు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సన్మానం

A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి:

ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని మన హెల్పింగ్ హాండ్స్ బ్లడ్ డోనర్స్ గ్రూప్ 2019వ సంవత్సరంనుంచి ఎన్నో ప్రాణాలను కాపాడే కార్యక్రమాల్లో ముందుండుతోంది ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయిస్తూ గ్రూప్‌ ద్వారా ఇప్పటివరకు 15 సార్లు రక్తదానం చేసిన సేవాకర్తను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి శాలువాతో సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజానికి అవసరమైన సమయంలో ముందుకు వచ్చి సేవ చేయడం గొప్ప ధైర్యం ఇలాంటి యువత ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలి అని పేర్కొన్నారు రాబోయే రోజుల్లో మరింత సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆశిస్తూ అభినందనలు తెలిపారు.

రక్తదానం ద్వారా ప్రాణాలను నిలిపే ఈ సేవా దృక్పథం మరింత మంది యువతలో స్పూర్తిని నింపుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Leave a Comment