*ఆర్మూర్ కోర్టులో పర్యావరణ దినోత్సవ వేడుకలు…
*న్యాయమూర్తులతో మొక్కలు నాటి ర్యాలీ నిర్వహణ…
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్మూర్ కోర్టు ప్రాంగణంలో పలు కార్యక్రమాలు బుధవారం నిర్వహించబడ్డాయి ఉదయం 9:30 గంటలకు మొక్కలు నాటే కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీదేవి అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ సరళ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గడుగు గంగాధర్ పాల్గొన్నారు.
అదేరోజు సాయంత్రం 4:30 గంటలకు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీని కోర్టు ప్రాంగణం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జక్కుల శ్రీధర్ ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్ ఉపాధ్యక్షులు గటడి ఆనంద్ సంయుక్త కార్యదర్శి మద్దుల గంగాధర్ గ్రంథాలయ కార్యదర్శి శ్రావణ్ కుందారం సీనియర్ న్యాయవాది లోక భూపతిరెడ్డి పిపి ఖాందేశ్ శ్రీనివాస్ మాజీ అధ్యక్షులు చిలుక కిష్టయ్య న్యాయవాదులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.