A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
నందిపేట్ మండలం జోర్పూర్ గ్రామ శివారులో ఓ వృద్ధ దంపతులు తమ భూమిలో బోర్ వేయించుకుంటున్న సమయంలో స్థానిక వ్యక్తి వచ్చి బెదిరించిన ఘటన చోటుచేసుకుంది.
జోర్పూర్ గ్రామానికి చెందిన కనక గౌడ్ దంపతులకు సర్వే నంబర్లు 82/1, 90/అ/1, 58/ఆలో భూమి ఉంది ఈరోజు బోర్ వేయిస్తున్న సమయంలో నందిపేటకు చెందిన హరీష్ అనే వ్యక్తి అక్కడకు వచ్చి భూమి తనదని పేర్కొంటూ బోర్ పనులను అడ్డగించాడు ఇంకా బోర్ వేస్తే చంపేస్తానంటూ తీవ్ర బెదిరింపులకు పాల్పడ్డాడు.
ఈ విషయమై బాధితులు నందిపేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు భూమిని దొంగతనంగా కబ్జా చేసేందుకు హరీష్ (భాజపా) ప్రయత్నిస్తున్నాడని వృద్ధ దంపతులు మీడియాకు తెలియజేశారు తమ వద్ద ఉన్న భూమిపై అక్రమంగా హక్కు కల్పించుకునేందుకు బెదిరింపులకు పాల్పడటం బాధాకరమని పేర్కొన్నారు.
స్థానికులు ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.