A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆలూరు మండలంలో మూడు ముక్కల, పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం 3 గంటల సమయంలో పోలీసులు దాడి చేసి, పేకాట ఆడుతున్న అబ్దుల్ కరీం, బంజే ప్రవీణ్, చామంతి నరసయ్య, నీలం రంజిత్, దోర నారాయణ, సున్నపు లింగం సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి ₹10,830 నగదు, 5 సెల్ఫోన్లు, 3 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.