*ఘోర హత్య కేసు చేధన…
*ఓ మహిళను చంపిన నిందితుడి అరెస్టు…..
A9 న్యూస్ ప్రతినిధి:
తేదీ 26.05.2025 న రాత్రి సమయంలో నందిపేట్ మండలం షాపూర్ గ్రామానికి చెందిన సాద సుమలత (42) అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తి హత్య చేసిన కేసును పోలీసులు చేధించారు ఈ సంఘటనపై మృతురాలి కుమారుడు సాద సంజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 27.05.2025న క్రైం నం 140/2025 u/s 103(1) BNS కింద కేసు నమోదైంది
సీపీ నిజామాబాద్ ఆదేశాల మేరకు ఏసీపీ ఆర్మూర్ పర్యవేక్షణలో ప్రత్యేకంగా ముగ్గురు బృందాలు ఏర్పాటుచేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు ఈ నేపథ్యంలో ఈరోజు 03.06.2025 మధ్యాహ్నం 12:30 గంటలకు చిట్టాపూర్ X రోడ్ వద్ద పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు
నిందితుడు గొల్ల పెద్ద గంగాధర్ (46) ఆలూరు గ్రామానికి చెందిన వాడు మద్యం మత్తులో ఒక మహిళను మాయమాటలతో రైతు ఫారంలో గల నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి గొడవల నేపథ్యంలో ఆమెను చీర కొంగుతో తర్వాత తానే చుట్టుకున్న టవాలతో ఉరివేసి హత్య చేసినట్టు నిందితుడు ఒప్పుకున్నాడు నేరం అనంతరం కొన్ని రోజులు నిర్మల్ జిల్లా బంధువుల వద్ద ఉండి తప్పించుకునే ప్రయత్నం చేశాడని విచారణలో వెల్లడయ్యింది
నిందితుడి వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన బైక్ తువ్వాలు సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసు చేధనలో చాకచక్యంగా వ్యవహరించిన ఆర్మూర్ రూరల్ సీఐ కె. శ్రీధర్ రెడ్డి నందిపేట ఎస్సై ఎం. చిరంజీవి హెడ్ కానిస్టేబుల్స్ నరేందర్ సుదర్శన్ కానిస్టేబుల్స్ అనిల్ అంబర్ సింగ్ తదితర పోలీస్ సిబ్బందిని ఏసీపీ ఆర్మూర్ వెంకటేశ్వర్ రెడ్డి అభినందించారు.