*విగ్రహ తరలింపు సమయంలో కరెంట్ షాక్….
*కోరుట్ల ఎస్ఎఫ్ఎస్ స్కూల్ సమీపంలో ప్రమాద…
A9 న్యూస్ ప్రతినిధి కోరుట్ల:
కోరుట్ల పట్టణంలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్ సమీపంలో గణపతి విగ్రహాన్ని తరలిస్తున్న సమయంలో విద్యుత్ తీగలు తగలడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో యువకులకు తీవ్ర గాయాలకు గురయ్యాడు. గాయపడిన వ్యక్తులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. ఈ తరహా విగ్రహాల తరలింపులో జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.