A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి, నీ మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఐపీఎస్ పువ్వుల మొక్కను బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కమిషనర్ను ఆత్మీయంగా స్వాగతించి జిల్లాలో శాంతిభద్రతలు పరిపాలనలో పోలీస్ శాఖ పాత్రపై ప్రశంసలు తెలిపారు పరస్పర సహకారంతో జిల్లాను అభివృద్ధి బాటలో తీసుకెళ్లేందుకు ఇద్దరూ సమన్వయంతో ముందుకెళ్లాలని ఆకాంక్ష వ్యక్తమైంది.
ఈ సమావేశంలో జిల్లా పరిపాలన మరియు పోలీస్ శాఖ అధికారులు హాజరయ్యారు.