A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
నందిపేట్ మండలం నందిపేట్ కు చెందిన సిద్ధూ(22) హైదరాబాద్లో మెట్రో పిల్లర్ను ఢీకొని మృతి చెందిన విషయం తెలిసిందే. అదే ఘటనలో సిహెచ్ కొండూర్కు చెందిన మరో యువకుడు సందీప్(22) తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ గురువారం రాత్రి చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే సోమవారం రాత్రి స్నేహితుడి బర్త్ డే పార్టీకి వెళ్లి తిరుగు ప్రయాణంలో వేగంగా వెళ్లి మెట్రో పిల్లర్ను ఢీ కొట్టారని పోలీసులు తెలిపారు. దీంతో రెండు కుటుంబాలు శోక సముద్రంలో మునిగిపోయాయి.