* బాధితులకు న్యాయం చేయాలి.
తెలంగాణ రాష్ట్ర బీసీ , ఎస్ సీ , ఎస్ టీ , మైనారిటీ సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షులు బుస్సాపూర్ శంకర్.
A9 news,ఏర్గట్ల మండలం, తాళ్ల రాంపూర్:
గ్రామంలో 15 మంది గౌడ కుటుంబాలను బహిష్కరించడం అమానుషమని BC , SC , ST , మైనార్టీ సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బుస్సాపూర్ శంకర్ అన్నారు.
రోజురోజుకు వీడీసీల అరాచక
పరిపాలన ఎక్కువ అవుతుందని , ఈ నియంతృత్వ పాలన అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని తెలంగాణ BC , SC , ST , మైనారిటీ సంక్షేమ వేదిక తరుపున డిమాండ్ చేశారు.
గీతా కార్మికులలో ఎస్సీ , ఎస్టీ , బీసీలు అందరూ కలిసి జీవనాభివృద్ధి కోసం పనిచేస్తుండగా వారిని భంగం కలిగిస్తూ
అవమానపరచడమే కాకుండా గ్రామం నుండి బహిష్కరణ చేసినందున వీడీసీలపై తగిన చర్య
తీసుకోవాలని కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు .
శ్రీ రామ నవమి పర్వదినం సందర్భంగా గౌడ సోదరులు కుంకుమార్చన లో భాగంగా ఆలయంలో కూర్చొని కుంకుమార్చన చేయటానికి అన్ని సిద్ధం చేసుకుని , వచ్చారని వారిని అదే సమయంలో ఆలయం నుంచి బయటకు వెళ్లిపోవాలని ప్రేరేపించడం పట్ల బుస్సాపూర్ శంకర్ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాధితులకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సైద్గర్ శ్రీనివాస్ , CH నరేందర్ , జిల్లా కార్యదర్శి చిందకింది సంతోష్ , జిల్లా ఆర్గనైసింగ్ సెక్రెటరీ నవీన్ చారి జిల్లా నాయకులు దాసరి రాజేష్ , నల్ల మోహన్ , అంకార్ గణేష్ , నిజామాబాద్ నగర అధ్యక్షుడు చంద్రకాంత్ , వడ్ల రాజేష్ , ఆర్ముర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.