A9 న్యూస్,
ఆర్మూర్,09
ఆర్మూర్ పట్టణంలో ని ప్రయాణ ప్రాంగణంలో ఇటీవల వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ పోలీసులు నిరంతరం నిఘా పెంచడం జరిగింది .గురువారం మధ్యాహ్నం మహారాష్ట్ర నాగపూర్ కు చెందిన వ్యక్తి ఆర్మూర్ బస్టాండ్ లో ప్రయాణికుల వద్ద నుండి సెల్ఫోన్లను దొంగలిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. దొంగిలించిన సెల్ ఫోను సంబంధిత బాధితుడికి అందించడం జరిగింది .సెల్ఫోన్ దొంగను పట్టుకున్న ఆర్టీసీ కానిస్టేబుల్ రాజశేఖర్ ను పలువురు అభినందించారు.