*శ్రీనివాస్ నగర్ రైల్వే స్టేషన్ లో అన్ని రైలు ఆపాలి…..
*మెదక్ ఎంపీ రఘునందన్ రావుకి కి వినతి పత్రం…
*మాసాయిపేట బిజెపి మండల అధ్యక్షుడు మొలుగు నాగేందర్ రెడ్డి…
A9 న్యూస్, మాసాయిపేట, మెదక్ జూన్ 3:
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండల కేంద్రంలో ఉన్న ( శ్రీనివాస్ నగర్ ) రైల్వే స్టేషన్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్టేషన్ మాస్టర్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మెదక్ ఎంపీ రఘునందరావుతో మాసాయిపేట మండల అధ్యక్షులు మొలుగు నాగేందర్ రెడ్డి మాట్లాడారు అదేవిధంగా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని చిన్నపాటి ప్యాసింజర్ రైళ్లు ఆగుతున్నాయని కొద్దో గొప్ప ప్రయాణికులు ప్రయాణాలు చేస్తూ ఉంటే వారిపై దాడులు జరుగుతున్నాయని ఎవ్వరు స్పందించక పోవడంతోభయ భ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు అనంతరం మాసాయిపేట మండలం కేంద్రంలో ఉన్న ( శ్రీనివాస్ నగర్ రైల్వే స్టేషన్ ను) ప్రైవేట్ గా నడిపిస్తున్న స్టేషన్ను జాతీయ రహదారికి అనుకూలంగా కేవలం 900 మీటర్లు ఆనుకొని ఉన్న స్టేషన్ను రెగ్యులర్ స్టేషన్ చేస్తూ బుకింగ్ కౌంటర్ తో పాటు స్టేషన్ మాస్టర్ ను కూడా ఏర్పాటు చేయాలని అలాగే అన్ని రైల్లు ఆగేవిధంగా చూడాలని ఎంపీ రఘునందన్ రావుకి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని మొలుగు నాగేందర్ రెడ్డి అన్నారు అనంతరం శ్రీనివాస్ నగర్ రైల్వే స్టేషన్ చుట్టుముట్టు గిరిజన తండాలను కలుపుకొని (20) గ్రామాలునుండి వందల సంఖ్యలో కార్మికులు, ఉపాధ్యాయులు, జీవనోపాధి కోసం మేడ్చల్ అల్వాల్ బొల్లారం సికింద్రాబాద్ కు వ్యాపారస్తులు చేసుకోవడానికి రావడం పోవడం జరుగుతుందని గతంలో చేసిన ప్రజా ప్రతినిధులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు తెలుసు కానీ ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేదని వివిధ గ్రామాల నుండి ప్రయాణికులు వస్తారని ఎంపీ రఘునందన్ రావు కి తెలపడం జరిగింది అనంతరం గిరిజనులు వివిధ భవన నిర్మాణ లేబర్ ప్రజలు ప్రతి ఒక్కరూ విజ్ఞప్తి చేస్తున్నారు అని గతంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఇప్పటివరకు స్పందన లేకపోవడంతో మీ దృష్టికి తేవడం జరిగిందని ఎంపీ రఘునందన్ రావు కి తెలపడం జరిగింది అని అన్నారు.