*బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు దోండి రమణ .
ఎ9 న్యూస్ మార్చ్ 26
తెలంగాణ రాష్ట్రంలో వాస్తవాలను ప్రజలకు తెలియ చెప్పేందుకే జై బావు జై భీం జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం చేపట్టామని బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు దొండి రమణ అన్నారు. అధిష్టానం నిర్ణయించిన టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జై బాపు జై భీం జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమ సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా దోండి రమణ మాట్లాడుతూ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గొప్ప కార్యక్రమం అని, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి ప్రజల వద్దకు వెళ్లి స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు స్వాతంత్రం వచ్చిన తరువాత దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలకు అందించిన అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేసే విధంగా, అదే విధంగా దేశంలో బిజెపి ప్రభుత్వం ఏ విధంగా
రాజ్యాంగాన్ని అవమానిస్తూ కించపరుస్తూ వివరాలను క్లుప్తంగా తెలియజేస్తామని వినయ్ కుమార్ రెడ్డి అన్నారు