A9 న్యూస్ ప్రతినిధి:
సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి రాయల సుభాష్ చంద్రబోస్ (రవన్న) అమరత్వ స్ఫూర్తితో ఉద్యమించుదామనీ నిజామాబాద్ జిల్లా న్యూడెమోక్రసీ సహాయ కార్యదర్శి దాసు శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఆర్మూరు పట్టణంలోని మామిడిపల్లి (శ్రామిక నగర్) లో న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి సూర్య శివాజీ అధ్యక్షతన రవన్న తొమ్మిదవ స్మారక సభను పురస్కరించుకొని రవన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. దాసు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రవన్న విద్యార్థి దశలో విప్లవ రాజకీయాలు నేర్చుకొని, దోపిడీ పీడనలేని రాజ్యం కోసం, అజ్ఞాతవాసిగా ఉండి, పార్టీని నడిపించారని ఆయన తెలిపారు. అతి,మితి వాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ, అనేకమంది విద్యార్థి,యువతను సామాజిక విప్లవకారులుగా తీర్చిదిద్దారని ఆయన తెలిపారు. గోదావరి లోయ ప్రతిఘటన పోరాట యోధుడు రవన్న ఆదివాసి గూడెంలో పొడిచే పొద్దుగా,
ఆదివాసుల ప్రియతమ నాయకుడిగా చెరగని ముద్ర వేసుకున్నారని ఆయన అన్నారు. రవన్న జీవితాంతం నిరాడంబరముగ, క్రమశిక్షణ కలిగిన విప్లవకారుడిగా ఉండి, స్ఫూర్తిని ఇచ్చారని ఆయన తెలిపారు. రవన్నతో యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రత్యక్ష సంబంధాలు ఉండి, రవన్న కలిసినప్పుడు దేశ, అంతర్జాతీయ రాజకీయాలు చర్చించి, సామాజిక మార్పు కోసం దృఢంగా ఎలా నిలబడాలనే ధైర్యాన్ని కలిగించే వారిని దాసు తెలిపారు. 2016 మార్చు 9 తేదీన రవన్న బ్రెయిన్ స్ట్రోక్ తో అమరుడయ్యారని, రవన్న అమరత స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడదాం అని దాసు ప్రజలకు పిలుపునిచ్చారు.
న్యూడెమోక్రసీ ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి సూర్య శివాజీ మాట్లాడుతూ పుట్టుక మరణం సహజమే కానీ ప్రజల కోసం జీవించడం మరణించడం హిమాలయాల కన్నా ఉన్నతమని ఆయన అన్నారు. నరేంద్ర మోడీ 10 ఏళ్ల పరిపాలనలో ప్రజలకు నిరుద్యోగం, పేదరిక, అసమానతలు, అప్పులు, ఆత్మహత్యలు మిగిల్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాటమే రవన్నకు నిజమైన నివాళి అని ఆయన అన్నారు. ఈ స్మారక సభలో అరుణోదయ జిల్లా అధ్యక్షులు సూరిబాబు, పి.వై.ఎల్ జిల్లా మాజీ అధ్యక్షులు రవి, పి.డి.ఎస్.యు జిల్లా సహాయ కార్యదర్శి ప్రిన్స్, అరుణోదయ రంజిత్, పిడిఎస్యూ హుస్సేన్, ఐ ఎఫ్ టి యు స్థానిక నాయకులు వర్ణారెడ్డి, అలిమ్, భాష, పి ఓ డబ్ల్యు నాయకులు మహమ్మదీ, పి.డి.ఎస్.యు నాయకులు రాహుల్, కళ్యాణ్, పవన్, రహమాన్ పి వై ఎల్, పి ఓ డబ్ల్యు సభ్యులు పాల్గొన్నారు.