ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు కొట్టారని ఆత్మహత్య:

 

 

A9 న్యూస్ ప్రతినిధి మెదక్:

 

మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన తలారి కిషన్ అనే వ్యక్తి తన ఫోన్ పోయిందని మంగళవారం రాత్రి అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు.

 

ఫిర్యాదు తీసుకోవాల్సిన పోలీసులు అతనిపై దురుసుగా ప్రవర్తించగా, కానిస్టేబుల్ సాయిలు అతనిపై చేయి చేసుకున్నాడు.. దీంతో మనస్తాపానికి గురైన కిషన్ ఆత్మహత్య నోట్ రాసి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Leave a Comment