ప్రభుత్వ పాఠశాలలో పిల్లల పై విష ప్రయోగయత్నం.. తప్పిన పెను ప్రమాదం:

A9 news,

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధరంపూరి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పిల్లల పై విష ప్రయోగయత్నం కలకలం.

విద్యార్థులు త్రాగే నీరు ట్యాంకులో విషం కలిపి, మధ్యాహ్న భోజనపు వంట సామాగ్రికు పురుగుల మందు పూసిన గుర్తు తెలియని దుండగులు.

పురుగుల మందు వాసన రావడం మరియు పురుగుల మందు డబ్బా పాఠశాల ఆవరణలో పడి ఉండడంతో అప్రమత్తమైన ప్రధానోపాధ్యాయురాలు.

అప్రమత్తమై పిల్లలను త్రాగు నీరు నల్లాల వైపు వెళ్లనివ్వకపోవడం, మధ్యాహ్న భోజనం వండకపోవడంతో తప్పిన పెను ప్రమాదం.

విష ప్రయోగం నుండి 30 మంది విద్యార్థులు క్షేమంగా బయట పడడంతో ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు, గ్రామస్థులు.

పాఠశాల ప్రధానపోధ్యాయురాలు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విషం ఎవరు కలిపారు అనే కోణంలో దర్యప్తు చేస్తున్న పోలీసులు….

Leave a Comment