పేద వృద్ధులకు ” అవ్వకు బువ్వ”

నిజామాబాద్ జిల్లా A9 న్యూస్ :

IMG 20240116 WA0026 IMG 20240116 WA0025

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల కేంద్రంలో రక్ష స్వచ్చంద సేవా సంస్థ, ఆర్మూర్ వారి ఆధ్వర్యములో పట్టణములో గల విద్యా హై స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన “*అవ్వకు బువ్వ*” కార్యక్రమములో ప్రతి నెలలో భాగంగా పేదలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా దాదాపు 54 మంది పేదవృద్ధులకు బియ్యం పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ ఖాందేష్, ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్, ఉపాధ్యక్షులు జిందమ్ నరహరి, విద్యా గోపి కృష్ణ పట్వారి, SG శ్రీకాంత్, కోశాధికారి గొనె శ్రీధర్, కార్యనిర్వహక కార్యదర్శులు Dr బేతు గంగాధర్, ఖాందేష్ సత్యం, తులసి పట్వారి, మీరా శ్రావణ్, మక్కల సాయినాథ్, సభ్యులు గోక శరత్, ఖోడే శ్రీనివాస్, రాజు, వినోద్, సంజీవ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment