నందికేశ్వర ఆలయాన్ని అభివృద్ధి దిశగా నూతన ఆలయ కమిటీ నిర్ణయం

నిజామాబాద్ జిల్లా A9 న్యూస్ :

IMG 20240117 WA0011 IMG 20240117 WA0010

నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో ఈరోజు కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీశ్రీశ్రీ పరమహంస పరివ్రాజక రాములు మహారాజు గారు నంది గుడి ఆలయ కమిటీ విజ్ఞప్తి మేరకు ఆలయాన్ని సందర్శించడం జరిగింది. ఆలయంలో కమిటీ ఆధ్వర్యంలో జరపడానికి సంకల్పించిన పనులను మహారాజు గారికి తెలియజేయడం జరిగింది. నూతన కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ క్యాషియర్ డైరెక్టర్లకు మహారాజు గారు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.చారిత్రక, మహోన్నత ఆలయమైన నందికేశ్వర ఆలయాన్ని, ఇంకా అభివృద్ధి చేయాలని, ఏకరాతి స్వయంభు లింగం నందితో కూడిన ఆలయం చాలా పవిత్రమైనదని, మహోన్నత శక్తులు కలిగిన ఈ ఆలయాన్ని వేద పండితుల ఆదేశాల మేరకు 24 గంటల నిరంతర రుద్రాభిషేకంతో శివలింగ శక్తి అనంతమవుతుందని, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆ పూజా కార్యక్రమాలు నిర్వహించాలని తెలపడం జరిగింది. మహారాజు గారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మచ్చర్ల సాగర్, వైస్ చైర్మన్ కిషన్, క్యాషియర్ ఎర్రం నడిపి ముత్యం, డైరెక్టర్లు దుబాయ్ శ్రీనివాస్, తాటికాయల సుభాష్, ఎర్రం ప్రవీణ్, ఎర్రంలింగం, ఆర్మూర్ గంగారం, బుక లింబాద్రి, వల్గొట్ రాజు, మడబోయి గణేష్, కుమ్మరి శ్రీకాంత్, సుంకరి సుమన్, దవత్ లింగం, చెలిమెల విట్టల్ పాల్గొన్నారు.

Leave a Comment