జిల్లాలో ఏజెంట్ మోసాలకు బలవుతున్న కుటుంబాలు:

 

 

-ఏజెంట్ చేసిన మోసానికి గుండెపోటుతో ఒకరు మృతి..

 

A9 న్యూస్ ప్రతినిధి:

 

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం లో తన కుమారుడిని యూరప్ పంపిస్తానని ఏజెంట్ మోసం చేయడంతో మనస్తాపానికి గురైన తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన ఆర్మూర్ పట్టణంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన రాజేష్ లాల్(55) తన కుమారుడు సృజన్‌ను యూరప్ పంపడానికి ఆర్మూర్‌కు చెందిన ప్రసాద్ అనే ఏజెంట్‌కు రూ.10 లక్షలు చెల్లించాడు. అయితే సదరు ఏజెంట్ సృజన్‌ని యూరప్ కాకుండా కజకిస్తాన్ పంపించడంతో తిరిగి ఇండియాకు వచ్చాడు. తనను మోసం చేసినందుకు తిరిగి డబ్బులు ఇవ్వాలని రాజేష్ లాల్ బుధవారం ఉదయం ఏజెంట్ ఇంటికి వెళ్లి అడిగాడు. వారు స్పందించకపోవడంతో మనస్తాపం చెందాడు. అనంతరం గుండెపోటు వచ్చి మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు మృతదేహంతో ఏజెంట్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.

Leave a Comment