సంగారెడ్డి జిల్లా: జనవరి 25
విద్యాబుద్ధులు నేర్చుకో వాల్సిన విద్యార్థులతో తట్ట,పార చేత పట్టించి దినసరి కూలీల మాదిరిగా విద్యార్థుల చేతులు కాయలు కాసేలా మట్టిపనులు చేయించిన ఘటన తాజాగా సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ పాఠశాలలో వెలుగు చూసింది.
పాఠశాలలో విద్యార్థులను విద్యావంతులుగా మార్చా ల్సిన ఉపాధ్యాయులు కూలీలుగా మారుస్తున్నా రన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పాఠశాల ప్రహరీగోడ కూలిపోవడంతో అటు నుండి విద్యార్థులు బయటికి వెళ్తున్నారని….
ఆ ప్రాంతంలో పహరి గోడ కట్టేందుకు కూలీలను పెట్టి పనిచేయించుకుంటే ఖర్చు అవుతుందని కక్కుర్తి పడి విద్యార్థులతో తట్ట, పార పట్టించి, చిన్నారుల చేతులకు కాయాలు కాసే పనులు చేయిస్తున్నారు.
బాలల కార్మిక వ్యవస్థను నిర్మించడం కోసం ప్రభుత్వం చట్టాలు చేసిన అవి అమలు కావడం లేదు అని అనడానికి ఇది ఒక నిదర్శనం….