A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్, ఏప్రిల్ 14:
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఆదివారం చేపూర్. పల్లె గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. ఉద్యోగ ఉపాధ్యాయ కుల సంఘాల నాయకులు, ఆర్మూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూర్యకంటీ చిన్నారెడ్డి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అంటరానివారుగా పరిగణించబడే పేద కుటుంబంలో పుట్టినా ఎదురుచూపులు కాచుకుంటూ ఎదిగి వచ్చారన్నారు. సాంఘిక పరమైన ఆర్థికపరమైన అవమానాలతో నిరంతరం పోరాడుతూ స్వయంకృషితో పైకి వచ్చారు. ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ విదేశాలలో విద్యాభ్యాసం పూర్తిచేసి జాతి గర్వించే స్థాయికి ఎదిగారని కొనియాడారు. ఎన్నో ఉన్నత పదవులను సైతం తునప్రాయంగా త్యజించి తన జీవితాన్ని దళిత జాతుల ఉన్నతికి అంకితం చేసిన మహనీయుడు అని కొనియాడారు. భారతదేశ ప్రథమ న్యాయశాఖ మంత్రిగా, రాజ్యాంగ రచన సంఘ అధ్యక్షునిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని చెప్పారు. ప్రతి పౌరునికి ప్రాథమిక హక్కులు లభించడానికి, చట్టం ముందు అందరూ సమానులేనని చాటడానికి, అస్పృశ్యత నేరం అన్న అంశాన్ని చట్టబద్ధం చేయడానికి ఆయన చేసిన కృషి మూల కారణమని పేర్కొన్నారు. తరతరాలుగా మతం పేరుతో బూజు పట్టిన భావాలతో తోటి వారిని ముఖ్యంగా మహిళలను విచక్షణకు, అవమానాలకు, అన్యాయానికి, అత్యాచారాలకు గురి చేస్తున్న వ్యవస్థపై పోరాటంలో భాగంగా ఆయన హిందూ కోడ్ బిల్లును రూపొందించారన్నారు. ఈ సందర్భంగా రెండు గ్రామాలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాసరి శ్రీకాంత్. రామ్ సన్. తాజా మాజీ సర్పంచ్ ఇందూరు సాయన్న మాజీ ఎంపిటిసి జన్నెపల్లి గంగాధర్. సొసైటీ మాజీ డైరెక్టర్ సాలంగి శాంతి కుమార్ మాజీ ఉప సర్పంచ్ కటికే శ్రీనివాస్. పల్లె విడిసి అధ్యక్షుడు. సుంకపాక రవి. జోరిగే ధర్మయ్య. నితిన్ రాజ్. యూత్ నాయకులు మేకల రాకేష్. గంజి మిన్ను. అఖిల్ .గంజి మనోహర్. తదితరులు పాల్గొన్నారు.