కెసిఆర్ కు యావజ్జీవ శిక్ష పడేటట్లు చేయాలి: ఆకునూరి మురళి

నిజామాబాద్ జిల్లా A9 న్యూస్ :

IMG 20231221 WA0005

తెలంగాణలో తప్పుడు డిజైన్ తో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడంతో ప్రజల సొమ్ము లక్ష కోట్ల రూపాయలు వృథా అయ్యిందని..!! మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఆరోపించారు. ‘దీనికి బాధ్యులైన అధికారులు, ఇంజినీర్లు, మంత్రులతోపాటు కేసీఆర్ ను ప్రాసిక్యూట్ చేసి యావజ్జీవశిక్ష పడేలా చేయాలి. ఆ.. లక్ష కోట్ల రూపాయలతో 3,000 ఇంటర్నేషనల్ స్కూల్స్, ఉచిత బస్సు రవాణా సౌకర్యం, 119 నియోజకవర్గాల్లో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు వచ్చేవి’ అని మురళి ట్వీట్ చేశారు.

Leave a Comment