ఐటీఐల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

A9 న్యూస్ ప్రతినిధి: 

రాష్ట్రంలోని ఐటీఐల్లో ప్రవేశాల కోసం విద్యాశాఖ దరఖాస్తులను ఆహ్వానించింది ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐలతో పాటు కొత్తగా ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్‌డ్ టెక్నికల్ సెంటర్ల (ఏటీసి)లో ప్రవేశ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు

ఇంటర్మీడియట్‌కు ప్రత్యామ్నాయంగా ఉద్యోగావకాశాలు అందించే ఐటీఐలపై విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది ఇందుకోసం ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 2 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు పదో తరగతి లేదా ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు

ఈ ఏడాది ఆగస్టు 1 నాటికి కనీస వయసు 14 ఏళ్లు ఉండాలి గరిష్ట వయోపరిమితి లేరు దరఖాస్తు సమయంలో రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అభ్యర్థులు తమ విద్యా సర్టిఫికెట్లు జనన ధృవపత్రం కుల ధృవపత్రం తదితర ధ్రువీకరణ పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి

ప్రవేశాల కోసం అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది మెరిట్‌ ఆధారంగా మరియు అర్హతల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐటీఐలలో సీట్లు కేటాయించబడతాయి

విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ భవిష్యత్తుకు దారితీసే టెక్నికల్ విద్యలో అడుగుపెట్టవచ్చని అధికారులు తెలిపారు.

Leave a Comment