హైదరాబాద్ తరలి వెళ్లిన మధ్యాహ్న భోజన కార్మికులు

Screenshot 2023 09 13 at 11 18 26 WhatsApp

తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా నుండి హైదరాబాద్ లో జరిగే ధర్నాకు పెద్ద ఎత్తున మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తరలివెళ్లారు, వారి వాహనాలకు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల గోవర్థన్ జెండా ఊపి ప్రారంభించారు, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన 3000 రూపాయల వేతనం కోసం, పెండింగ్ లో ఉన్న కోట్ల రూపాయల బిల్లుల సాధనకై, హైదరాబాద్ తరలి వెళ్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు చామంతి లక్ష్మి, నాయకులు సురేందర్ రెడ్డి, లక్ష్మి, శిరీష,సాయన్న, కనకయ్య, సుజాత, నిరంజన,తదితరులు పాల్గొన్నారు

Leave a Comment