స్వాతంత్య్ర దినోత్సవం రోజున బస్సు టికెట్లపై టీఎస్‌ఆర్టీసీ రాయితీ.

స్వాతంత్య్ర దినోత్సవం రోజున బస్సు టికెట్లపై టీఎస్‌ఆర్టీసీ రాయితీ.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బస్సు ప్రయాణికులకు ఆర్టీసీ ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. ఇవి ఈనెల 15వ తేదీన మాత్రమే అమల్లో ఉంటాయి

పల్లె వెలుగు బస్సుల్లో 60 ఏళ్లు దాటిన స్త్రీ, పురుషులకు 50 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. వయసు ధ్రువీకరణకు ఆధార్‌కార్డు చూపాలని స్పష్టం చేసింది. అదే విధంగా హైదరాబాద్‌లో 24 గంటల అపరిమిత ప్రయాణానికి సంబంధించి టీ-24 టికెట్‌ను రూ.75కే ఇవ్వనున్నట్లు తెలిపింది. పిల్లలకు టీ-24 టికెట్‌ ధర రూ.50గా నిర్ణయించింది. రాయితీలను ఉపయోగించుకుని స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొనాలని ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాలకు ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033లను సంప్రదించాలని సూచించారు

Leave a Comment